Chandrabose | చిట్యాల, జూలై3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. ఆసార్ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆసార్ గ్రంథాలయం అని నామకరణం చేశారు.
రెండంతస్తులతో నిర్మించిన గ్రంథాలయం భవన నిర్మాణం పూర్తయి, అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. పదునైన పాటలతో సినీ పరిశ్రమలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిపై మాత్రం తన మమకారాన్ని చూపిస్తూ చంద్రబోస్ అందరి మన్ననలు పొందుతున్నారు. అట్టహాసంగా నేడు ప్రారంభించే ఆసార్ గ్రంథాలయం చెంతకు చంద్రబోస్ మిత్రులు, శ్రేయోభిలాషులు, కళాకారులు, మిత్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని చంద్రబోస్ సోదరుడు రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
2024-07-03T20:07:28Z dg43tfdfdgfd