NITHYA MENEN | విజయ్‌ సేతుపతి జోడీగా నిత్యామీనన్‌

Nithya Menen | ‘స్కైలాబ్‌’ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది మలయాళీ భామ నిత్యామీనన్‌. అయితే తమిళ, మలయాళ భాషల్లో మాత్రం తన అభిరుచికి తగిన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. గత కొంతకాలంగా కమర్షియల్‌ చిత్రాల్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నదీ అమ్మడు.

ఈ నేపథ్యంలో తమిళంలో విజయ్‌సేతుపతి సరసన భారీ ప్రాజెక్ట్‌లో నాయికగా ఖరారైనట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘మహారాజ’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్‌ సేతుపతి. ఈ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో ఆయన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి.

ఈ నేపథ్యంలో పాండిరాజ్‌ దర్శకత్వంలో తన తదుపరి సినిమాకు సన్నద్ధమవుతున్నారు విజయ్‌ సేతుపతి. ఇందులో నిత్యామీనన్‌ కథానాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిత్యామీనన్‌ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.

2024-07-03T20:52:36Z dg43tfdfdgfd