విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త వినిపించింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారి నుంచి ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల నడుస్తోంది. అయితే ఈ కళాశాలలో చేరాలనుకునేవారికి టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 2024-25 విద్యాసంవత్సరానికి సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు.
డిప్లొమా కోర్సు వ్యవధి నాలుగేళ్లు కాగా.. సర్టిఫికేట్ కోర్సు రెండేళ్లలో పూర్తికానుంది.
మరోవైపు ఆసక్తికలిగి, అర్హులైన విద్యార్థులు డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది. జూన్ 17వ తేదీ వరకు కాలేజీలో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయన్న టీటీడీ.. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.tirumala.org వెబ్సైట్ను గానీ, కాలేజీ ఆఫీస్ నంబర్లైన 0877-2264637, 9866997290 నంబర్లను సంప్రందించాలని తెలిపింది.
అన్ని ప్రశ్నలకు ఆధునిక శాస్త్రాలు మూలమైతే.. అన్ని సమాధానాలకు వేదాలకు మూలమని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ధార్మిక, శాస్త్ర విధానాలను మేళవించి పదిరోజులు తిరుమలలో సుమారుగా 7-8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించినట్లు ధర్మారెడ్డి వివరించారు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-01T16:58:44Z dg43tfdfdgfd