పొన్నూరులో పవన్ కళ్యాణ్ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్‌ను తవ్వేశారు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనకు వెళ్లబోతున్నారు. అయితే పవన్ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్‌ను తవ్వేయడం కలకలంరేపింది. పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ బహిరంగ సభకు హాజరవుతున్నారు. పవన్ సభ కోసం, హెలిప్యాడ్ అనుమతుల కోసం కూటమి నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు.. ఇటీవల సీఎం జగన్‌ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈలోపు కొందరు హెలిప్యాడ్‌ను తవ్వేశారు.. జేసీబీ సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఇదంతా స్థానిక వైఎస్సార్‌సీపీ నేతల పనిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఎలా వాడుకుంటారంటూ హెలిప్యాడ్‌ను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని చెబుతున్నారు. దీంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.. అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T06:08:41Z dg43tfdfdgfd