LOVE AFFAIR: ఎనిమిదేళ్ల డీప్ లవ్.. పెళ్లికాగానే అదృశ్యమైన ప్రియుడు.. స్టోరీ మాములుగా లేదుగా..

Boy Friend missing after marriage with girl in tamilnadu: మనలో చాలా మంది యువత ఇటీవలీ కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమలో ఇద్దరు కలిసి కొంత కాలంపాటు జర్నీచేస్తారు. దీంతో ఒకరంటే మరోకరికి అర్థం చేసుకొవడానికి కొంత సమయం ఉంటుంది. అంతే కాకుండా ఆలోచనలు, ఫ్యూచల్ ప్లాన్ లు, తమ పద్ధతులు అన్ని కూడా ఓపెన్ గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే అరెంజ్డ్ పెళ్లిళ్లలో ఈ వెసులు బాటు అస్సలు ఉండదు. పెళ్లి చూపులు, ఆ తర్వాత వెంటనే పెళ్లి జరిగిపోతుంది. దీంతో పెళ్లి కాగానే ఇద్దరి ఆలోచనలు, పద్ధతులు,పెరిగిన వాతావరణం భిన్నంగా ఉండటం వల్ల గొడవలు వస్తాయని యువత భావిస్తారు. కొందరు ప్రేమలో పడినప్పుడు ఎంతో సీరియస్ గా ఉంటారు. తాము కోరుకున్న వారికోసం ఎన్నాళ్లైన వేచీచూస్తారు. ఎలాంటి త్యాగాలు చేయడానికి సైతం వెనుకాడరు. ఇక మరోవైపు మరికొందరు మాత్రం ఏదో ఏజ్ వల్ల వచ్చిన ఆకర్షణని లవ్ అనుకుంటారు. కొంత కాలం పాటు కలసి అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతారు.

Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

కొంత మంది పెళ్లిళ్లకంటే ముందే చేయరాని తప్పులుకూడా చేసేస్తుంటారు. తీరా పెళ్లి చేసుకొమ్మని నిలదీస్తే ఈరోజు, రేపు అని కాలం వెళ్లదీస్తారు. గట్టిగా నిలదీస్తే ఎదురు తిరిగి, దాడులకు తెగబడుతుంటారు. కొందరు ప్రేమిస్తున్నామనిచెప్పి అమ్మాయిలను నమ్మిస్తారు. ఇక పెద్దల భయానికి లేదా వీళ్ల మీద మోజు తీరిపోవడంతో వదిలించుకోవడానికి అనేక ప్లాన్ లు వేస్తుంటారు.ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.ఈ కోవకు చెందిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు..

తమిళనాడులో కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్ పేట సమీపంలోని సిరుత్తనూర్ గ్రామానికి చెందిన రోస్లిన్ మేరీ, చెన్నైలో ఆస్త్రత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే.. అదే గ్రామం తమిళ రసన్ అనే వ్యక్తి చెన్నైలోని ప్రైవేటు బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునేవారు. ఇలా దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకొవాలని యువతి రోస్లిన్ మేరీ పట్టుబట్టింది. దీంతో మేరీకి, తమిళరసన్ ల మధ్య గొడవలు వచ్చాయి. వెంటనే  యువతి తన ఇంట్లో వాళ్లకు ప్రేమ విషయం చెప్పేసింది. యువకుడు ఎంతచెప్పిన వినకపోవడంతో, యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read More: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

ఇరు కుటుంబాలను పీఎస్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. దీంతో యువకుడు తమిళరసన్ తో, రోస్లిన్ మేరీల పెళ్లిని ఒక ఆశ్రమంలో జరిపించారు. యువకుడు అయిష్టంగానే యువతి మెడలో తాళికట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాళి కట్టిన తర్వాత నుంచి యువకుడు పూర్తిగా మాయమైపోయాడు.ఎంత వెతికిన అతని జాడ దోరకలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు. యువతీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-07T07:29:36Z dg43tfdfdgfd