24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి

24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి

ఆత్మకూరు, వెలుగు: బాల్యంలో వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటుతో చనిపోవడంతో కలత చెందిన భర్త కూడా గుండె ఆగి కన్నుమూశాడు. బంధువులు గ్రామస్తుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పొగాకుల సుగుణమ్మ (70) గురువారం గుండెపోటుతో చనిపోయింది. 

దీంతో ఆమె భర్త పొగాకుల చేరాలు (80) ఆవేదన చెందాడు. ఆమెను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అంత్యక్రియల తర్వాత గురువారం రాత్రి నిద్రలోనే తనువు చాలించాడు. ‘ ఆ భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండలే. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే పోయేటోళ్లు. చావులో కూడా కలిసే పోయిళ్లు’ అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. సుగుణమ్మ, చేరాలు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, పెండ్లిళ్లు చేశారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-27T03:09:51Z dg43tfdfdgfd