30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

ఇండియాలో రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు..? వారి ఆస్తులు ఎన్ని కోట్లు..? ఎవరితో ఎక్కవ సినిమాలు చేశారు..? 

 

సినిమాలకు నిర్మాతే వెన్నెముకలాంటివారు. డైరెక్టర్లుకాని, హీరోలు కాని.. సినిమాకు సబంధించిన ఎవరైనా నిర్మాతల వల్ల  ఎదగాల్సిందే. నిర్మాత అనేవారు సినిమా చేయకపోతే.. సినిమాకు సబంధించిన ఎవరు ఎదగడానికి అవకాశమే ఉండదు. అటువంటి నిర్మాతల్లో.. రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు..? ఇండియాలో భారీగా ఆస్తులు సంపాదించిన నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం. 

హీనా ఖాన్ నుంచి గౌతమి, మనీషా కొయిరాలా వరకు..! క్యాన్సర్‌ తో పోరాడిన హీరోయిన్లు ఎవరంటే..?

ఆ నిర్మాత ఎవరో కాదు.. కోలీవుడ్ కు చెందిన కళానిధి మారన్. సన్ గ్రూప్ ను  2008లో సన్ పిక్చర్స్ అనే సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించింది.  కళానిధి మారన్ ఈ సంస్థను స్థాపించగా.. 2010  నుంచి ఈ సంస్థ సినిమాలను నిర్మిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఫస్ట్ మూవీ ఎంథిరన్ ఈసినిమాను తెలుగులో రోబోగా రిలీజ్ చేశారు. గ్రేట్ డైరెక్టర్ శంకర్  దర్శకత్వంలో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, సంతానం, కరుణాస్ తదితరులు నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. 

పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?

 

మొదటి సినిమానే 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు కళానిధి.  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో సన్ పిక్చర్స్ మొదటి సినిమాతోనే మంచి లాభాలను ఆర్జించింది. దీని తర్వాత విజయ్ సర్కార్, పెట్టా, నమ్మ విధి పిల్లై, మృగం, జైలర్ వంటి వరుస సినిమాలను నిర్మించారు కళానిథి. ఈసినిమాలకు నెగెటీవ్ టాక్ వచ్చినా.. ఆతరువాత పుంజుకున్న సినిమాలు బోలెడు ఉన్నాయి.  ఇక సన్ పిక్చర్స్ పలు చిత్రాలను పంపిణీ చేసింది  కూడా.

 

ముఖ్యంగా గత ఏడాది రజనీకాంత్ నటించిన జైలర్‌ను సన్ పిక్చర్స్ నిర్మించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.  బాక్సాఫీస్ దగ్గర  రికార్డు సృష్టించింది.  200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల వరకూ వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సన్ పిక్చర్స్ కు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం  కూడా జైలర్ కావడం విశేషం. 

జైలర్ ఇంత భారీ విజయం సాధించడానికి సన్ పిక్చర్స్ ప్రధాన కారణం. సన్ పిక్చర్స్ ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి అయినప్పటికీ, 1993లో కళానిధి మారన్ సన్ టీవీ అనే శాటిలైట్ ఛానెల్‌ని ప్రారంభించారు. అతను తెలుగు, మలయాళం, కన్నడ వంటి అన్ని దక్షిణ భారతీయ భాషలలో టీవీ ఛానెల్‌లను ప్రారంభించాడు, దేశం అంతటా సన్ గ్రూప్ అసాధారణ వృద్ధిని సాధించింది. అలా సన్ గ్రూప్ అనే భారీ సామ్రాజ్యాన్ని సృష్టించాడు కళానిధి మారన్. 

 

ఈ దశలో కళానిధి మారన్‌కు భారతదేశంలోనే అత్యంత సంపన్న నిర్మాతగా గౌరవం దక్కింది. కళానిధి మారన్ భారతదేశంలోని అతిపెద్ద నిర్మాతలు, కరణ్ జోహార్ మరియు గౌరీ ఖాన్‌ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.30 000  కోట్లు ఉంటుందని అంచన. దీంతో భారతదేశంలోనే అత్యంత సంపన్న నిర్మాతగా తమిళనాడుకు చెందిన కళానిధి మారన్‌కు గౌరవం దక్కింది.

2024-06-29T14:28:21Z dg43tfdfdgfd