కాజల్ అగర్వాల్ ఖతర్నాక్ ఫోటోషూట్.. అవకాశాల కోసం అందాలు ఆరబోత
పెళ్లి, పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతోంది. బాలయ్య మూవీ భగవంత్ కేసరితో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యాడ్స్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తోంది.Photo : Instagram అది అలా ఉంటే కాజల్కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా భారీ పాన్ ఇండియా స్థాయిలో “కన్నప్ప” అనే మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తుండగా.. కా ఇక లేటెస్ట్గా కా జల్ కి కూడా అవకాశం కల్పిస్తున్నారు నిర్మాతలు. Photo : Instagram ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది.. Photo : Instagram లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ..చందమామతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో పెద్ద హీరోలందరితో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు పెంచాలని చూస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.Photo : Instagram సింగిల్ పీస్ ఫుల్ హ్యాండ్స్ బ్లూ డ్రెస్సుపై వైట్ ప్యాచ్ డిజైన్ తో ఉన్న ఈ డ్రెస్సులో కాజల్ అగర్వాల్ మరింత అందంగా కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా కనిపిస్తోంది. కాజల్ తన శరీర సౌందర్యం కనిపించేలా పోజులిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo : Instagram ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Photo : Instagram ఇండస్ట్రీలో కొద్ది రోజుల్లో వంద కోట్ల ఆస్తి సంపాదించింది కాజల్. ఈ ముద్దుగుమ్మకు కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు.Photo : Instagram సినిమాలతో పాటు తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్రస్తుతం తన భర్త గౌతమ్తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉన్నారు. Photo : Instagram
2024-05-16T02:30:47Z
ఫస్ట్ మూవీ బ్లాక్బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.
2024-05-14T07:54:01Z
బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.
2024-05-15T09:27:42Z