ANCHOR LASYA: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం

Anchor Lasya Husband Manjunath Father Died: ప్రముఖ టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మామ, తన భర్త 'మంజునాథ్'తండ్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాస్య భర్త మంజునాథ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. తన తండ్రి ఫోటోను షేర్‌ చేస్తూ ఇకపై ఆయన భౌతికంగా తమతో లేరంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ పోస్ట్‌పై "మీరు భౌతికంగా మాతో లేకపోయినా. మీ ఆత్మ ఎల్లప్పుడు మాతోనే ఉంటుంది. మిస్‌ యూ నాన్న" అంటూ మంజునాథ్‌ ఎమోషల్‌ అయ్యాడు.

అయితే తన తండ్రి మృతికి కారణం ఏంటన్నది మాత్రం మంజునాథ్‌ వెల్లడించలేదు. ఈ విషయం తెలిసి టాలీవుడ్‌ నటీనటులు, టీవీ యాక్టర్స్‌ లాస్యకు, మంజునాథ్‌-లాస్య కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.అంతేకాదు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవరిస్తూ ఫుల్‌ పాపులర్‌ అయ్యింది. యాంకర్లలోనే లాస్య అంటే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన కామెడీ, ప్రాసలతో మంచి ఆదరణ అందుకుంది. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్‌ లాస్య తన మార్క్‌ను క్రియేట్‌ చేసుకుంది.

మా టీవీలోని ఓ షోకు యాంకర్‌ రవితో కలిసి హోస్ట్‌ చేసింది లాస్య. బుల్లితెరపై వీరిద్దరి పెయిర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో యాంకర్‌ లాస్య-రవిగా పాపులర్‌ అయ్యారు. ఈ క్రమంలో వారిపై ప్రేమ, పెళ్లి రూమర్స్‌ కూడా వచ్చాయి. కానీ వీరిద్దరి సన్నిహితం కేవలం తెరవరకు మాత్రమేనని, బయటకు తాము మంచి స్నేహితులం చెప్పేవారు. ఫైనల్‌గా‌ ఇద్దరు వేరువేరుగా పెళ్లి చేసుకుని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యారు. 2017లో లాస్య మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్‌కు గుడ్‌బై చేప్పేసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇంట్లోనే భర్త, పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది. అలాగే ఓ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి దాని ద్వారా తరచూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.  

Also Read: హాలీవుడ్‌లో అవి నాకు చీకటి రోజులు - న్యూయార్క్‌ నగరం భయంకరమైంది..!

2024-04-28T10:35:23Z dg43tfdfdgfd