Trending:


Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారు..? రేవంత్, చంద్ర‌బాబు భేటీపై నిరంజ‌న్ రెడ్డి సెటైర్లు

Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని రేవంత్, చంద్ర‌బాబు భేటీపై మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


Samantha | సమంత పోస్టుపై డాక్టర్ల ఫైర్‌

మరోసారి సమంత హాట్ టాపిక్‌గా మారింది. సమంత పెట్టిన పోస్టుపై కొందరు డాక్టర్లు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ సమంత పెట్టిన పోస్టు ఏంటి? ఎందుకు ఆమెపై అలా కొందరు సీరియస్ అవుతున్నారు. ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇటు టాలీవుడ్‌తో పాటు.. కోలీవుడ్ అటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది.


మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అరాచకం..!

ఒక టాలీవుడ్ దర్శకుడు హిందీ రీజినల్ లాంగ్వేజ్‌లో సంచలనాలు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. రాజమౌళి తర్వాత అలాంటి సంచలనం అనే మాటను సందీప్ రెడ్డి వంగా సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆయన హిందీలో తీసింది రెండు సినిమాలు మాత్రమే. అందులో ఒకటి తెలుగు రీమేక్ సినిమానే. కానీ పది, పదిహేను సినిమాలకు సరిపడ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కబీర్ సింగ్‌తో షాహిద్‌కు, యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్‌కు వాళ్ల సినీ కెరీర్‌లోనే అత్యధిక గ్రాసర్ సినిమాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు హిందీ నాట సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. కమర్షియల్‌గానే కాదు.. ఈ రెండు సినిమాల టైమ్‌లో వచ్చిన కాంట్రవర్సీలను కూడా తన స్టైల్లో ఇచ్చి పడేశాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ప్రభాస్‌కు పాతికవ సినిమా. కల్కీతో అఖండ విజయం సాధించిన ప్రభాస్‌.. తన తదుపరి సినిమా సందీప్‌తో చేస్తుండటంతో యావత్ సినీ ప్రియుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఇందులో ప్రభాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలియడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే... ఈ సినిమా మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా తెరకెక్కబోతున్నట్ల ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా కాకుండా.. కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా కథ రాసుకున్నట్లు రూమర్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి మైఖేల్ జాక్సన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అలాంటి గొప్ప సింగర్, డ్యాన్సర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కితే మాత్రం మాములుగా ఉండదు. కానీ ఇందులో నిజా నిజాలు తెలియలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే...


Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా...

Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా... తెలంగాణలో ప్రత్యేకమైన అతిపెద్ద జాతర బోనాల పండగ.. ఈ ఆదివారం(  జులై 7) ఆషాడంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ బోనాలతో నగరంలో బోనాల సందడి జరుగనుంది. తొలుత గోల్కొండ, తరవాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, ఆ తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే భోజనం...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Anant Ambani - Radhika Merchant | ఘనంగా అనంత్, రాధికా సంగీత్ వేడుక

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు, తమ డ్యాన్సులతో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా B-టౌన్ ప్రముఖులు పాల్గోన్నారు. నిన్న రాత్రి (జూలై 5) నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.


Adulteration Beer: కల్తీ బీర్‌ కలకలం.. మందుబాబుల్లో కలవరం

Adulteration Beer: తెలంగాణలో కల్తీ బీర్‌ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఓ బార్‌లో కల్తీ బీర్‌లు కనిపించాయి. దీనిపై మందుబాబులు నిర్వాహకులను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


Manish Sisodia | మరోసారి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.


Kalki 2898 AD | రూ.800 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. కొనసాగుతున్న జైత్రయాత్ర

Kalki 2898 AD | బాక్సాఫీస్‌ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కేవ‌లం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?

Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


కొడాలి నానికి బిగ్ షాక్.. ఆయనతో పాటూ వాసుదేవరెడ్డి, IAS మాధవీలతా రెడ్డిపై కేసు

Another Case On Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని, ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ రెండో పట్టణ పీఎస్‌లో గుడివాడ ఆటోనగర్‌ వాసి దుగ్గిరాల ప్రభాకర్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ గోడౌన్ విషయంలో వీరి తీరుతో తన తల్లి మనస్తాపం చెంది...


Nellore News: స్కూళ్లలో ఇదేం పాడు పని.. ఇద్దరు సిగ్గు లేకుండా!

Nellore Thieves Arrested In Schools Theft Cases: నెల్లూరు జిల్లాలో ఇద్దరు వెరైటీ దొంగల ఆట కట్టించారు పోలీసులు.. చాలా రోజులుగా సవాల్‌గా మారిన చోరీ కేసుల్ని చేధించారు. ఈ ఇద్దరు దొంగలు ఇళ్లు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్ని టార్గెట్ చేశారు. కొంతకాలంగా స్కూళ్లలో చొరబడి విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతున్నారు. పోలీసులు స్పెషల్ టీమ్ సాయంతో వీరిని అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి వీరు ఇలా చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు.


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


Kodali Nani | కొడాలి నానిపై గుడివాడలో కేసు.. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీపై కూడా!

Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ముగ్గురిపైనా 448, 427, 506 ఆర్‌అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Media Academy | 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం : అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి

Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


నిరుద్యోగులకు శుభవార్త... ఇంటర్వ్యూకి హజరైతే చాలు జాబ్ పక్కా..!!

జాబ్ మేళా అంటేమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఆవ్యక్తి స్కిల్, వే ఆఫ్ స్టైల్, మాట్లాడే తీరు, ఇచ్చే సమాధానం,మాట్లాడే భాష, వారి చదువు సంధ్యలు , పొందిన మార్కులు వీటిని ఆధారం చేసుకొని ఇంటర్వ్యూస్ తీసుకొంటారు. వీరు అడిగే క్రమాన్ని చక్కగా వివరణ ఇస్తే జాబ్ పక్కా... ఒక్కసారి జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ తో ను వర్క్ ఎక్సపీరియన్స్ తో ఉన్నత పదవులను కూడ అధికమించవచ్చు.అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్...


Saturday motivation: తొందరపాటు మాని.. మనసుల్ని గెలవండి..

Saturday motivation: తొందరపాటూ, ఆతృత వల్ల మన జీవితంలో అనేక అనర్థాలు జరగొచ్చు. ఈ అలవాటు మానుకుంటే ఎన్ని లాభాలో చూడండి.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Raj Tarun: హీరోయిన్‌తో రాజ్ తరుణ్ ప్రియురాలు వాగ్వాదం - ఆడియో రికార్డింగ్ లీక్, ఎవరీ మాల్వీ మల్హోత్రా?

Raj Tarun News: ఇటీవల యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడంటూ ఒక అమ్మాయి పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లావణ్య అనే యువతి.. హీరో రాజ్ తరుణ్‌తో తాను 11 ఏళ్ల నుంచి కలిసుంటున్నానని, ఇప్పుడు ఓ హీరోయిన్ కోసం తనను వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. లావణ్య చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండించాడు. కానీ లావణ్య మాత్రం తాను చెప్తుంది నిజం అని నిరూపించడం కోసం...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


హే శ్రీలీల.. ఏంటి జేమ్స్‌బాండ్ చెల్లిగా మారావ్!

శ్రీలీల ఉన్నట్టుండి జేమ్స్‌బాండ్ చెల్లిగా మారిపోయింది.


YS Birth Anniversary YSRCP : వైఎస్ 75వ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - క్యాడర్ అంతా పాల్గొనేలా కార్యక్రమాలు

YCP is making arrangements for YS 75th birth anniversary : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఊరిలోనూ వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణ చేయడం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పిల్లలకు స్కూల్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు...


Sumalatha: దర్శన్ నా కొడుకులాంటి వాడు - అభిమాని హత్య ఘటనపై సుమలత షాకింగ్ కామెంట్స్

Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి...


రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసి.. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని మీకు తెలుసా..? ఇంతకీ మెగా పవర్ స్టార్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏది..? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కథ సూట్ అవ్వక.. లేదా హిట్ అవుతుందో లేదో అని నమ్మకం లేక.. లేదా.. డైరెక్టర్ మీద డౌట్ తోనో.. స్టార్ హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తుంటారు. ఆ కథలతో మరో స్టార్ హీరో హిట్ కొట్టిన...


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


Srisailam | శ్రీబయలు వీరభద్ర స్వామికి పరోక్షంగా విశేష పూజాధికాలు..!

శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్ర స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.


ఇండియన్ సినిమా సరికొత్త రారాజు మనోడే.. దెబ్బకు బాలీవుడ్ స్టార్స్‌కు చెమటలు

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన తొలి 6 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ, విదేశాల నుంచి అభిమానులు వచ్చి సినిమాను చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ప్రభాస్ అంకితభావం అతడిని ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిందని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలు : ప్రతి సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన కల్కితో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. బాహుబలి, సలార్ తర్వాత కల్కి సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ప్రభాస్‌వే మూడున్నాయి. ఇలా ఎవ్వరూ సాధించని ఫీట్‌ని చేరుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కీ చూడటానికి జపాన్ నుంచి ఇండియాకు : బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ‘కల్కి 2898 ఏడీ’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీని చూడటానికి జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఇండియాకి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ‘రెబెల్ ట్రక్‌’ పక్కన నిలబడుతూ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని మూవీ టీం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంత అభిమానాన్ని సంపాదించడం ప్రభాస్‌కి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ : ఇండియాలో ప్రభాస్ స్టార్‌డమ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ పనితీరే ఇందుకు నిదర్శనం. ఎంచుకున్న ప్రతి పాత్రపై ఎంతో డెడికేషన్ చూపిస్తాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అందుకే, కాంటెంపరరీ సినిమాలో ప్రభాస్ అత్యంత ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిలుస్తున్నాడు. పని విషయంలో స్ట్రిక్ట్ : పని విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఈ పట్టుదల, సంకల్పం, సినిమా మీదున్న ప్యాషన్.. డార్లింగ్‌ని స్టార్‌గా మలిచాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ప్రభాస్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ ‘డార్లింగే’ : ప్రొఫెషనల్ కెరీర్ సంగతి అటుంచితే ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తాడు. ఇక, సెలబ్రిటీలకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్‌తో నటించే ప్రతి ఒక్క కో స్టార్ ఈ విషయాన్ని చెబుతారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రభాస్ గొప్పతనం గురించి వివరిస్తారు. అలా, ప్రభాస్ మానవత్వం, నిజాయితీ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.


Anushka: ముగ్గురు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న అనుష్క.. ఏకంగా ఆయనతోనే..!

టాలివుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం. గత రెండు దశాబ్దాలుగా ఆమెకు సంబంధించి చిన్న చిన్న రూమర్స్ తప్ప పెద్ద కాంట్రవర్సీలు ఏం లేవు. రెబల్ట్ స్టార్ ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ నడుపుతోందని తెగు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కంటే ముందు మరో ముగ్గురు స్టార్స్‌తో ఎఫైర్ నడిపినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్వీటీ తన సుదీర్ఘ కెరీర్‌లో స్టార్ హీరోస్‌తో పాటుగా, సాంకేతిక నిపుణులతో ఎఫైర్స్ నడిపారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, తాను ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్పినా సరే అనుష్క రిలేషన్‌షిప్‌లో ఉందంటూ నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా టైమ్‌లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌తో పాటుగా హీరో గోపీచంద్‌తో కూడా లవ్ ట్రాక్ నడిపారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో వచ్చి లక్ష్యం సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత శౌర్యం సినిమాలో కలిసి నటించి మరో హిట్ కొట్టారు. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు వీరిద్దరూ స్పందించలేదు. 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది. అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో అనుష్క మంచి అనుబంధం కలిగి ఉంది. వీరి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. కింగ్ సినిమాలో నాగార్జున కోసం అనుష్క స్పెషల్ సాంగ్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే కొద్ది రోజులకు వీటికి కూడా బ్రేక్ పడింది. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి స్వీటీని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయాకాలాల్లో అనుష్క ఈ రూమర్స్ ఫేస్ చేశారు.


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


Ravi Teja: రవితేజ ప్లేస్ లో విశ్వక్ సెన్.. మొత్తానికి హీరోని మార్చేసిన డైరెక్టర్..

Vishwak Sen Upcoming Movies: జాతి రత్నాలు సినిమాతో.. మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ అనుదీప్. ఈ దర్శకుడు..ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. రవితేజతో.. దాదాపు సినిమా ఓకే అయింది..కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు.. రవితేజ స్థానంలో అనుదీప్ మరొక యంగ్ హీరోని..రంగంలోకి దింపాడు.


'ఆశీస్సులు' అనే అర్థం వచ్చే పిల్లల పేర్లు ఇవిగో!

ఆశీస్సులు అనే పదం స్ఫూర్తితో పిల్లలకు పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ నేమ్స్ చెక్ చేయండి.


అనాథల జీవిత చిత్రం

ఏబీసీడీ ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘గల్లీ గ్యాంగ్‌స్టార్స్‌'. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నెల్లూరులో చిత్రీకరణ జరిపాం.


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


Hathras stampede: బాగా బాధపడ్డారట- భరించే శక్తి దేవుడు ప్రసాదిస్తాడట- హథ్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన బోలే బాబా

‘Bhole Baba’ Reacts To Hathras ‘satsang’ Stampede: ఉత్తరప్రదేశ్‌(UP) హథ్రాస్(Hathras) జిల్లాలో సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బోలే బాబా(Bhole Baba).. ఈ దుర్ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనుకు కేంద్ర బిందువుగా ఉన్నా నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ బోలే బాబా... ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు. 121 మంది మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న బోలేబాబా... ఈ బాధను భరించే శక్తిని దేవుడు...


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జర...


Memes | రిషీ సునాక్‌ వారానికి 70 గంటలు పనిచేయలేదా..? : నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ మీమ్స్‌

Memes : బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


Ashada Masam | ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాసం ఉత్సవాలు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు ఆషాడ మాస మొదటి రోజున దేవస్థానము వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది ఆషాడం మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు


కల్కి సినిమాలో తన నటనతో అదరగొట్టిన కరీంనగర్ బాలుడు ఇతనే..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కిమూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష . కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...