PADMA VIBHUSHAN CHIRANJEEVI: పద్మవిభూషణుడితో రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హజరయ్యారు. అలానే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిరు పురస్కారం అందుకోవడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గర్వంగా ఉంది

ఇక చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆయనతో కలిసి ఓ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు కంగ్రాట్స్ డాడీ.. మిమ్మల్సి చూస్తే గర్వంగా ఉందంటూ రామ్ చరణ్ ఓ పోస్టు పెట్టారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరుకి శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

]]>
View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

]]>
ఇక అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "కళామతల్లికి, కళా రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి అభిమానించిన అందరికి, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్బంగా అభినందించిన వారికీ, నా నమస్సుమాంజలి" అంటూ చిరు ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి గుర్తింపుగా దేశంలోనే రెండో అత్యన్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక అవార్డుల ప్రదానోత్సవం తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా పురస్కార గ్రహీతలకి ఆయన నివాసం వద్ద డిన్నర్ అరేంజ్ చేశారు. దీనికి చిరంజీవి తన కుటుంబతో కలిసి హాజరయ్యారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-10T03:07:13Z dg43tfdfdgfd