Committee Kurrollu Gorrela Song : మందుంటే చాలు మంచి అక్కర్లేదు..AP ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని కమిటీ కుర్రాళ్లు సాంగ్
మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాళ్లు.కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా పదకొండు మంది హీరోలు,నలుగురు హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేస్తోంది నిహారిక. అంతేకాకుండా ఈ సినిమాలో సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ,యశ్వంత్ పెండ్యాలతో పాటు మరికొంతమంది యూట్యూబర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకుని..సరైన టైములో సాంగ్ రిలీజ్ చేశారు. "మందుంటే చాలు మంచి అక్కర్లేదు అంటారు..ఎవరొస్తే మాకేంటి అంటూ గొర్రెల్లా బ్రతికేస్తారు..అంటూ సాగే లిరిక్స్ ఆడియన్స్ తో పాటు జనాలని సైతం ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ స్వరపరిచిన సాంగ్ కు తగ్గట్లే నాగ్ అర్జున్ సాహిత్యం అందించారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓసారి వినేసి..రాబోయే ఎలక్షన్స్ ఓటేసేముందు ఆలోచించండి.
ఇక పాట మధ్యలో నిహారిక రంగంలోకి దిగి..‘మంచి జరగాలి..ఊరు మారాలి..స్కూల్స్ కావాలి..జాబ్లు రావాలి..దెబ్బకి జాతకాలు మారిపోవాలి.. ఐయ్ బాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి..చివరికి మాత్రం ఓటుని అమ్ముకి దొబ్బాలి’ అని చెప్పింది. ఇంతకీ ఏమంటారండీ ఇప్పుడు అని అంటే..‘డబ్బుచ్చిటోళ్లని మింగా..ఓట్లమ్ముకునేటోళ్లని మింగా..ఐదువేలకు అమ్ముడుపోయే వాళ్లని మింగా’..అంటూ డబుల్ మీనింగ్లో మింగా..మింగా..మింగా అంటూ బూతులు తిట్టించింది నిహారిక. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోల విషయానికి వస్తే..ప్రసాద్ బెహరా,ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, శివకుమార్ మట్ట మిగిలిన హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T12:19:44Z dg43tfdfdgfd