KARAN JOHAR: కమెడియన్ అయ్యుండి నన్ను అవమానించాడు..ఎమోషనల్ అయిన స్టార్ డైరెక్టర్

Karan Johar Viral Post: బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీలలో ఒకరైన కరణ్ జోహార్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమెడియన్ ఆయనను అవనామించడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కరణ్.

Karan Johar about trolls : క‌రుణ్ జోహార్ గురించి తెలియని వారు ఉండరు. డైరెక్టర్ గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఘనత ఉన్నది కరణ్ జోహార్ కే. ఇప్పటికే ఎందరో టాలెంట్ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్, తెలుగులో స్టార్ హీరోల సినిమాలను సైతం బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. 

బాహుబలి సినిమాని హిందీ లో డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా కరణ్ జోహార్. ఇప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ లు ఉన్న అలియా భట్, సిద్ధార్ధ్ మల్హోత్రా, వంటి నటులను ఇండస్ట్రీ కి పరిచయం చేశారు కరణ్ జోహార్. కాఫీ విత్ కరణ్ అనే సెలబ్రిటీ టాక్ షో.. విజయవంతంగా దశాబ్దకాలంగా నడుపుతున్నారు కరణ్. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే కరణ్ జోహర్ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయ‌న చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఒక పెద్ద క‌మెడియ‌న్ తనను అవ‌మానించారని చెప్పారు కరణ్ జోహార్. 

వాళ్ళ అమ్మవారితో కలిసి టీవీ చూస్తున్న సమయంలో ఒక టీవీ షో ఒక కమెడియన్ లో తన గురించి చాలా అసభ్యకరంగా ఇమిటేట్ చేశారు అని, ఆ విషయంలో చాలా భాధగా అనిపించింది అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కరణ్ జోహార్. 

"నేను మా అమ్మ‌తో క‌లిసి టీవీ చూస్తున్నాను. ఒక పెద్ద పేరు ఉన్న ఛానెల్‌లో ఒక రియాలిటీ కామెడీ షో ప్రొమో వ‌చ్చింది. అందులో ఒక పెద్ద క‌మెడియ‌న్ న‌న్ను చాలా చీప్‌గా ఇమిటేట్ చేశాడు. సోష‌ల్ మీడియాలో పేరు లేని, భయం లేని వాళ్ళు ఇలా చేయడం సహజమే. కానీ ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉన్న ఒక క‌మెడియ‌న్ నా గురించి ఇలా చేయ‌డం చాలా బాధ‌గా ఉంది. నేను 25 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటున్నాను. అలాంటి న‌న్ను ఇలా అవ‌మానించ‌డం బాధ‌గా ఉంది. ప్రొమో చూశాక నాకు కోపం రాలేదు. కానీ.. చాలా బాధ క‌లిగింది" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన ఆ ఆవేదన వెళ్లగక్కారు కరణ్ జోహార్. 

అయితే ఇంతకీ ఆ షో పేరు ఏమిటి, ఆయనను ఇమిటేట్ చేసిన ఆ కమెడియన్ ఎవరు అనేది మాత్రం కరణ్ జోహార్ బయటకు చెప్పలేదు. దీంతో అభిమానులు కరణ్ జోహార్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేసి ఆయనను ఓదారుస్తున్నారు. 

ఇక సినిమాల పరంగా చూస్తే కరణ్ జోహార్ 2023 లో రాజా ఔర్ రాణి కి ప్రేమ్ కహాని అనే సినిమాకి దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కరణ్ జోహార్ నిర్మాణంలో మిస్టర్ అండ్ మిసెస్ మహి ఈ నెల చివర్లో విడుదలకానుంది

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-07T05:46:23Z dg43tfdfdgfd