ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి.... అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ...వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
2024-05-20T05:47:18Z
ఈ 5 రాశుల వారు చాలా స్పెషల్.. వయసు పెరిగే కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది!
సాధారణంగా మనుషుల వయసు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. వయసుతో పాటు ప్రజల వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా ధోరణి మారడం సహజం. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బోరింగ్గా మారిపోతారు. యుక్త వయసులో చాలా యాక్టివ్గా ఉన్నవారు మధ్య వయసుకు వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు, యావరేజ్ పర్సన్గా మిగిలిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా యాక్టివ్గా మారుతారు. ఏజ్తో పాటు వీరి చర్మిస్మా, మెచ్యూరిటీ పెరుగుతాయి. వీరి వ్యక్తిత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఓల్డ్ వైన్ మాదిరిగా వీరు బెటర్ పర్సన్ అవుతారు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, 5 రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తులా రాశితులారాశి వారు త్రాసులా న్యాయంగా, బ్యాలెన్స్డ్గా ప్రవర్తిస్తారు. వీరు అందరితో బాగా కలిసిపోతుంటారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడతారు. వయసు పెరిగే కొద్దీ మరింత అట్రాక్టివ్గా మారుతారు. వారి చిరునవ్వు, మాటలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అంత బాగుంటుంది. ఈ మార్పు వయసుతో పాటు వస్తుంది. మకరంమకరరాశి వారు మేకలా కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. చాలా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉంటారు. వీరు ఎంతో శక్తివంతులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలరు. అయితే ఏజ్ బార్ అవుతున్నకొద్దీ వీరు మరింత గొప్పవారిగా మారుతారు. వయసుతో పాటు పెరిగే జ్ఞానం, వీరి వ్యక్తిత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది. మీనంమీనరాశి వారికి జాటి, కరుణ, ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వీరు ఇతరులు ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. అపారమైన జ్ఞానం వీరి సొంతం. అయితే మీనరాశి వారు ఏజ్ బార్ అయినా ఆకర్షణీయంగానే కనిపిస్తారు, మరింత ఆధ్యాత్మికంగా మారుతారు. వీరి జ్ఞానం, కరుణ వీరి మాటలలో, చేతలలో కనిపిస్తాయి. వృశ్చికంఈ రాశి వ్యక్తులు చాలా సీక్రెట్ లైఫ్ గడుపుతారు. అయినా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు వయస్సు పైబడుతున్నా ఎక్కువ మందిని ఆకర్షించగలరు. వీరి ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచనలు ఇతరులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. వృషభంవృషభం రాశి వారు ఎద్దులా బలంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడికి అసలు లోను కారు. వయస్సు పెరిగే కొద్దీ వృషభ రాశి వ్యక్తులు బెటర్ పర్సన్గా మారుతారు, వీరి చరిష్మా కూడా ఏజ్తో పాటు పెరుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
2024-05-20T10:32:51Z