KTR: 'నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారుచేస్తాం' - అలాంటి వారికి ప్రజలే జవాబు చెప్తారంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

KTR Sensational Tweet: శూన్యం నుంచి సునామీని సృష్టించి అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోరాట పంథాలో కదం తొక్కుతామని.. నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరి.. లక్షల మందితో ఓ సైన్యాన్ని తయారు చేశారని.. ఎన్నో అవమానాలు, కుట్రలు, కుతంత్రలు ఛేదించారని అన్నారు. అలాంటి వ్యక్తిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని అన్నారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్ల పోరాడి తెలంగాణ సాధించారని.. రాష్ట్ర దిశ, దశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్, బీఆర్ఎస్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని ట్వీట్ లో పేర్కొన్నారు. పోరాట పంథాలో కదం తొక్కుతామని స్పష్టం చేశారు.

Also Read: BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

2024-03-29T10:23:48Z dg43tfdfdgfd