MADHAVI LATHA: తెలంగాణ కేఏ పాల్ మాధవీలత... నెట్టింట వీడియోతో ట్రోలింగ్...!

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలత సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ట్రోలింగ్‌లో టాప్‌లో నిలుస్తున్నారు. ఆమె పలు సార్లు ట్రోలింగ్ బారిన పడుతున్నారు.. అయితే దీనికి ఆమె వ్యవహార శైలియే కారణమని చెప్పాలి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ట్రోల్స్ భారిన పడుతున్నారు మాధవీలత. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రచారం కొనసాగిస్తున్న మాధవీలత ప్రచార రథంపై తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ సంజ్ణలు చేస్తోంది. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా గాలిపటం దారం లాగి దానిని తెంచుతున్నట్లుగా చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె తెలంగాణ పాల్ అని, గత ఎన్నికల సమయంలో కేఏ పాల్ కూడా ఇలాగే ప్రవర్తించాడని నవ్వుకుంటున్నారు. ఆమెలో మరో నిత్యానంద కూడా కనిపిస్తున్నారని, ఆయన కూడా ఇలాంటి కామెడీలే చేసేవాడని ట్రోల్ చేస్తున్నారు. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా మసీదు వద్దకు రాగానే విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తున్నట్లు గా నటించారు. మాధవీలత చేసిన ఈ పని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తడంతో తాను రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు చూపించానని, మసీదు వైపు కెమెరా తిప్పారని చెప్పుకొచ్చారు. మళ్లీ అదే విధంగా రోడ్డుపై కూర్చొని విల్లు ఎక్కిపెట్టినట్లుగా చేశారు.

ఇటీవల మాధవీలతను హగ్ చేసుకున్న ఓ ఐఏఎస్ అధికారిణి కూడా వేటుకు గురయ్యారు. సైదాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాధవీలతకు సైదాబాద్ పీఎస్ మహిళా ఏఎస్ఐ ఉమాదేవి కరచాలనం చేశారు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది. వెంటనే మహిళా ఏఎస్ఐ ఉమాదేవిని సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉండగా పార్టీ అభ్యర్థిని కౌగిలించుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ నోటీసు జారీ చేశారు.

మాధవీలత విరంచీ హాస్పిటల్ ఛైర్మన్. సంఘ్ సభ్యురాలిగా ఉన్న మాధవీలతను.. ఓటమి ఎరుగని ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి బీజేపీ అధిష్ఠానం దింపిది. దీంతో ఈమె అందరి దృష్టి ఆకర్షించారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాతబస్తీలోనూ.. ఎంఐఎంకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు మాధవీలత. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. దూసుకుపోతున్నారు. అయితే ఆమె చేస్తున్న కొన్నిపనులు మాత్రం ఆమెను ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి. మరి ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా అనేది వేచి చూడాలి.

2024-04-25T13:32:46Z dg43tfdfdgfd