Mlc Kavitha Bail Petitions : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha)కు మళ్లీ నిరాశే ఎందురైంది. దిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ (Kavitha Bail)ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో కవితను ఈసీ అరెస్టు చేసింది. దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Policy)లో కవితపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత.. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాలని బెయిల్ అభ్యర్థించారు. ఒక మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్కు అర్హత ఉందని కోర్టు(Court)కు తెలిపారు. కవిత పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.... బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈడీ(ED) కేసులో కవితకు(Mlc Kavitha) దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఆమె తిహార్ జైలులో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్ల(Kavitha Bail Petitions)పై కోర్టులో వాదనలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ(CBI) అక్రమంగా అరెస్ట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదించారు. కవిత ఈ కేసులో కీలకమైన వ్యక్తి అని...ఆమె సూత్రధారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది.