ప్రధాని మనవరాలు.. 12 మందితో ఎఫైర్.. సినిమాల్లో స్టార్ హీరోయిన్.. చివరికి ఒంటరిగా!
ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రేకప్లు, విడాకులు కామన్. ఇక, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె కుటుంబం రాజకీయాల్ని శాసించింది. ఈ భామ కూడా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన ఓ సీనియర్ తార 12 మందితో డేటింగ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రేకప్లు, విడాకులు కామన్. ఇక, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె కుటుంబం రాజకీయాల్ని శాసించింది. ఈ భామ కూడా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన ఓ సీనియర్ తార 12 మందితో డేటింగ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమై ఉంటుంది. సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరమండి' 'మల్లికా జాన్' అలియాస్ మనీషా కోయిరాలా. హిరామండి వెబ్ సిరీస్తో మళ్లీ ట్రెండింగ్లో నిలిచింది. నేపాల్లో 1970లో జన్మించిన మనీషా కోయిరాలా..1991లో తన నట జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. గత 33 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో యాక్టివ్గా ఉంది. మనీషా కొయిరాలా ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించింది. మనీషా కొయిరాలా ప్రకాష్ కోయిరాలా కుమార్తె. నేపాల్ మాజీ ప్రధాని బిశేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు. నేపాలీ చిత్రం ఫేరి భేతౌలా (1989)తో మనీషా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.ఆ తర్వతా సౌదాగర్ (1991) అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్కుమార్, దిలీప్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత మనీషా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, నేపాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో వర్క్ చేసింది. మనీషా తన 33 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 70 సినిమాల్లో నటించింది. ఈ 33 ఏళ్ల కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. అలాగే, అనేక ప్రధాన పాత్రల్లో కీ రోల్ ప్లే చేసింది. అమీర్ ఖాన్ తో మ్యాన్ , సల్మాన్ ఖాన్ తో మజ్ధార్ , అజయ్ దేవగన్ తో కచ్చే ధాగే ధన్వాన్, 1942: అనిల్ కపూర్ తో ఎ లవ్ స్టోరీ, గోవిందతో మహారాజా, షారుఖ్ ఖాన్ దిల్ సే, నానా పటేకర్ తో అగ్ని సాక్షి వంటి సినిమాలు చేసింది మనీషా. అయితే మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను 2010లో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలలో విడాకులు తీసుకున్నారు. 2012లో భర్త నుంచి విడిపోయిన మనీషా 53 ఏళ్ల వయస్సులో ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది. వ్యాపారవేత్త సామ్రాట్ దహల్తో వివాహానికి ముందు మనీషా కోయిరాలా ఏకంగా 11 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. మనీషా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, DJ హుస్సేన్, నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్లతో ఎఫైర్ నడిపిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. మీడియా కథనాల ప్రకారం నానా పటేకర్ను వివాహం చేసుకోవడానికి ప్రయత్నిచింది. కానీ, కుదరలేదు. మనీషా కోయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో.. వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, మోడల్ రాజీవ్ మూల్చందానీ, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం చివరికి ఒంటరిగా మిగిలిపోయింది.
2024-05-12T07:16:14Z