PAANI PURI: పానీపూరీ ప్రేమికులకు గుండె పగిలే వార్త.. 8 పానీపూరీలకు రూ.333

Paani Puri: పానీపూరీ.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. పానీపూరీ కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి తింటూ ఉంటారు. ఇక అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలు పానీపూరీ లవర్స్ ఉంటారు. ఇక ఈ పానీపూరీ తక్కువ ధరలో వచ్చే ఒక స్నాక్ కావడంతో చాలా మంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా మెనూలో పానీపూరీని పెడుతున్నారంటే.. దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా ప్లేటు పానీపూరీ రూ.20, రూ.30 కే దొరుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్లేట్ పానీపూరీకి రూ. 333 వసూలు చేశారు.

ముంబై ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ బిజినెస్‌మెన్ పానీపూరీ తిందామని అక్కడే ఉన్న ఓ ఫుడ్ స్టాల్‌కు వెళ్లాడు. అక్కడ ప్లేట్ పానీపూరీ రూ.333 అని రాసి ఉండటం చూసి అవాక్కయ్యాడు. వెంటనే దాని ఫోటో తీసుకుని కౌశిక్ ముఖర్జీ అనే బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఉండే ఫుడ్ స్టాల్స్‌లోని ఫుడ్ చాలా ఖరీదు అని తెలుసు కానీ.. మరీ అంత కాస్ట్‌ లీ అని తెలియదు అని పేర్కొన్నాడు. ఆ ఫోటోలో పక్కనే దహీ పూరీ, సెవ్ పూరీ కూడా ప్లేట్‌కు రూ.333 ఉండటం గమనార్హం. ఒక్కో ప్లేట్‌లో 8 పానీపూరీలు ఉన్నాయి. అంటే 8 పానీపూరీలకు రూ.333 అన్నమాట.

ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఎయిర్ పోర్టు అయినా మరీ ఇంత రేట్లా అంటూ మండిపడుతున్నారు. ఈ పానీపూరీలు ఎయిర్‌పోర్టులో అమ్ముతున్నారు కాబట్టి.. ఎయిర్‌పోర్టు షేర్, మెయింటెనెన్స్ ఛార్జీలు, జీతాలు, వారి ఖర్చులు అన్నీ కలిపి రూ.33 ఖరీదు ఉండేది కాస్తా రూ.333 అయింది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇది పట్టపగలు దోపిడీ అని.. రూ.50 వేలు పెట్టి విమాన టిక్కెట్ కొంటే పానీపూరీకి రూ.333, కాఫీకి రూ. 100, దోశకి రూ. 200 ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.

ఇక అదే ఎయిర్‌పోర్టులో దోశకి రూ.375 ఉన్న మెనూ కార్డ్‌ను పోస్ట్ చేసిన మరో నెటిజన్.. ఈ ధరలను జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఇలాంటి ఫుడ్ కొనలేమని తెలిపాడు. ఇంత ధరలు ఎయిర్‌పోర్టుల్లో ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పన్నీర్‌ను కూడా బంగారం షాపుల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తారేమో అంటూ బాలీవుడ్ సినిమా "త్రీ ఇడియట్స్"లో అమీర్ ఖాన్ చెప్పే డైలాగ్‌ను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇక గతేడాది కూడా ముంబై ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్లో దోశ రూ. 600, గ్లాస్ బట్టర్ మిల్క్ రూ. 620 కి అమ్ముతున్నారని ఓ వ్యక్తి పోస్ట్ చేయడం తెగ వైరల్ అయింది. అంతకుముందు ఇదే ముంబై ఎయిర్ పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్పు టీ, వాటర్ బాటిల్‌కు రూ. 490 బిల్ అయిందని మరో ప్రయాణికుడు పోస్ట్ చేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T15:29:18Z dg43tfdfdgfd