Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli). పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి.
లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..రాజమౌళి తన సినిమాలే కాకుండా..ఇండస్ట్రీలో ఏ సినిమా బాగున్నా..దాన్ని కథ కథనాలను మెచ్చుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు.
రీసెంట్గా ప్రేమలు చూసి కూడా ప్రశంసలు కురిపించాడు. అలా ఆయన గతంలో డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన సినిమాను మెచ్చుకోవడంతో పాటు..లెటర్ రాసి మరి ప్రశంసలు ఇచ్చాడట మరి.
వివరాల్లోకి వెళితే..రీసెంట్గా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని చెప్పాడు "నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddhartha) మినహా..కార్తికేయ సినిమాలో పనిచేసిన వాళ్ళందరం పూర్తిగా కొత్త వాళ్ళమే.దాంతో ఆ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు.కానీ.,టీజర్ రిలీజ్ అయ్యాక మాత్రం డైరెక్టర్ రాజమౌళి లైక్ చేసి తన ట్విట్టర్ లో షేర్ కూడా చేశారని తెలిపారు.ఇక ఈ వార్తను ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ నాకు విషయం తెలియదు.ఆ తర్వాత నేను చూశాను.ఆ విషయం నాకు కార్తికేయ సినిమా విజయం కంటే చాలా హ్యాపీగా అనిపించింది.
రాజమౌళి మా సినిమా గురించి ట్వీట్ చేసినప్పుడు, సినిమా విడుదలకు ముందే సినిమాకు మంచి బజ్ వచ్చిందని. అలాగే టీజర్,ట్రైలర్ లను మెచ్చుకుంటూ..రిలీజ్ కు ముందే సినిమా హిట్ అవుతుందని చెప్పి ఓ లేఖను రాసిచ్చాడు.
ఆ లేఖను ఫ్రేమ్ కట్టుకొని మరీ పెట్టుకున్నానని చందూ తెలిపాడు.సినిమా రిలీజ్ కంటే ముందే రాజమౌళిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకు..అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించిందని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-03T16:35:43Z dg43tfdfdgfd