RANVEER SINGH: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... 

దీపికాతో పెళ్లి ఫోటోలు మాయం!

మంగళవారం రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఓ పెద్ద షాక్ తగిలింది. ఆయన అకౌంటులో ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. దీపికాతో లాస్ట్ ఇయర్ దిగిన ఫోటోలు ఉన్నాయి. కానీ, పెళ్లి ఫోటోలు లేవు. అవి మాయం కావడంతో ఏదో జరుగుతోందని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఇక త్వరలో విడాకులు తీసుకోవడమే మిగిలి ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. ముందు పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసి, ఆ తర్వాత విడాకులు తీసుకున్న జంటలు కొన్ని ఉండటంతో బాలీవుడ్ జనాలు కొందరిలోనూ అనుమానాలు మొదలు అయ్యాయి.

Also Readమారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?

గొడవల్లేవ్... ఆల్ ఈజ్ వెల్!

రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ మధ్య గొడవలు లేవని... అంతా సవ్యంగా ఉందని వాళ్లిద్దరి సన్నిహితుల ద్వారా బాలీవుడ్ జనాలకు తెలిసింది. అసలు మ్యాటర్ ఏమిటంటే... 2023కు ముందు ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో చేసిన పోస్టులను రణవీర్ ఆర్చివ్ చేశారు. అందువల్ల, అవి ఏమీ కనిపించవు. గతంలో దీపికా పదుకోన్ సైతం ఓసారి ఈ విధంగా చేశారు. అయితే... ఇటువంటి అనుమానాలు రావడంతో ఆమె తర్వాత అన్ని పోస్టులను ఇన్‌స్టాలో ఉంచారు. ఆర్చివ్ చేయడం వల్ల పాత పోస్టులు కనిపించకుండా ఇన్‌స్టాకు కొత్త లుక్ వస్తుందని సెలబ్రిటీలు అప్పుడప్పుడూ అలా చేస్తారు. అదీ సంగతి!

వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీప్ వీర్!

Ranveer Singh Deepika Padukone: ప్రజెంట్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్... ఇద్దరూ ఇండియాలో లేరు. వాళ్లిద్దరూ ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జంట కలిసే వెళ్లారు. షూటింగ్స్, ప్రమోషన్స్, యాడ్ షూట్స్ వంటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందువల్ల, పార్ట్నర్ తో టైమ్ స్పెండ్ చేయడం సరిగా కుదరదు. అందుకని, కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. 

ప్రజెంట్ రణవీర్, దీపిక బేబీమూన్ ట్రిప్ వేశారని బాలీవుడ్ అంటోంది. పొడుగు కాళ్ల సుందరి ప్రెగ్నెంట్ అనేది తెలిసిందే. వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వేసే టూర్లను బేబీమూన్ ట్రిప్ అంటారు. అదే పెళ్లైన తర్వాత వెళితే హనీమూన్ ట్రిప్ అన్నమాట. త్వరలో ఇండియాకు తిరిగి వస్తారట. ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో దీపిక ప్రెగ్నెంట్ అని ఈ స్టార్ కపుల్ అనౌన్స్ చేసింది. ఈ జంట ఇటలీలో 2018లో పెళ్లి చేసుకున్నారు. కొంకణి, సింధీ సంప్రదాయ పద్ధతుల్లో రణవీర్, దీపిక పెళ్లి చేసుకున్నారు. వివాహమైన ఆరేళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేశారు. అదీ సంగతి!

Also Read'స్వయంభు'కు భారీ బడ్జెట్ - నిఖిల్ సినిమాలో ఒక్క వార్ ఎపిసోడ్‌కు 8 కోట్లు

2024-05-08T09:33:49Z dg43tfdfdgfd