TAMILISAI: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వద్ద డబ్బులు లేకనే పోటీచేసినా, ఎన్నికల్లో ఓడిపోయానని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చింది.

దక్షిణ చెన్నై నియోజక వర్గంలో తమిళిసై లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం చేసిన తమిళిసై.. ఈసారైనా తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో తాను 5 సార్లు పోటీ చేసినా, డబ్బులు లేక ఖర్చు పెట్టలేదన్నారు. డబ్బులు లేకపోవడంతోనే తాను ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చానని తమిళిసై వ్యాఖ్యానించారు. డబ్బులు లేని కారణంగానే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు తమిళి సై సమర్థించారు. 

2024-03-29T09:38:43Z dg43tfdfdgfd