కమల్హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘భారతీయుడు-2’ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు కమల్హాసన్. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ మూడోభాగం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారాయన. ‘భారతీయుడు-2’ చిత్రంలో నటించడానికి ఏకైక కారణం మూడో భాగం తాలూకు కథనే అని కమల్హాసన్ తెలిపారు.
దర్శకుడు శంకర్ మూడో పార్ట్ కథ చెప్పినప్పుడు తాను ఓ అభిమానిగా మారిపోయానని ఆయన అన్నారు. ‘ప్రేక్షకులకు రెండో భాగం కూడా బాగా నచ్చుతుందనుకుంటున్నా. నాకైతే మూడోభాగం బాగా నచ్చింది. కానీ అది రిలీజ్ కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అప్పటి వరకు టెన్షన్గానే వేచి చూడాలి. మూడో భాగంలో కథానాయకుడు సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుంది’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. 1996లో సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్గా రానున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్సింగ్, ప్రియాభవానీ శంకర్, ఏస్జే సూర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
2024-07-03T20:41:23Z dg43tfdfdgfd