ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ

ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ

ఆది సాయి కుమార్ హీరోగా వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సాయికుమార్ అతిథులుగా హాజరయ్యారు. ఆది మాట్లాడుతూ ‘‘చుట్టాలబ్బాయ్’ తర్వాత వీరభద్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇది. 

మంచి కథ, స్క్రిప్ట్ కుదిరాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునే ఎంటర్‌‌‌‌టైనర్ ఇది. జూన్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తాం’ అని చెప్పాడు. దిగంగనా మాట్లాడుతూ  ‘‘క్రేజీఫెల్లో’ తర్వాత మళ్లీ ఆది గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ‘ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయి’ అని దర్శకుడు చెప్పాడు. మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృథ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి ఇతరపాత్రలు పోషిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T01:45:38Z dg43tfdfdgfd