ఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్

ఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్

సివిల్స్ ఫలితాల్లో ఆర్ఎంపీ కొడుకు సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన ఆర్ఎంపీ నరేష్, లలిత కుమారుడు బుద్ది అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా ఇంట్లోనే సొంతంగా నోట్స్ తయారు చేసుకొని చదివి విజయం సాధించారు. 

అఖిల్ 2018లో కేయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పై దృష్టిపెట్టారు. తొలిరెండు ప్రయత్నాల్లో విఫలంకాగా, మూడో ప్రయత్నంలో 566వ ర్యాంకు సాధించి ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎంపికయ్యారు. అక్కడ జాయిన్ అయి సివిల్స్ కోచింగ్ కొనసాగించారు. చివరికి ఐదో ప్రయత్నంలో 321వ ర్యాంకు సాధించారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-17T04:14:22Z dg43tfdfdgfd