ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు
ఘట్ కేసర్, వెలుగు : రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు నమోదైంది. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన ప్రకారం.. నారపల్లిలోని కొర్రెముల రోడ్డులో వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్లు గా ఆర్ఆర్ క్లినిక్ ను రవీందర్ రెడ్డి, డీబీఎం క్లినిక్ ను నరేందర్ నడుపుతున్నారు. రాష్ట్ర వైద్య మండలి(టీఎస్ పీసీ) రిజిస్టర్ డాక్టర్ హనుమంతరావు, టీఎస్ పీసీ విజిలెన్స్ అధికారులు బుధవారం ఆయా క్లినిక్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్ లుగా చెప్పుకుంటూ క్లినిక్ లను నడుపుతూ..
రోగులకు చికిత్సలు చేస్తూ వారి ఆరోగ్యాలతో ఆటలాడుతున్నట్లు గుర్తించారు. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేకుండానే క్లినిక్ లను తెరిచి అన్ని రకాల చికిత్సలు అందజేస్తూ రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నకిలీ డాక్టర్లపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-18T02:30:14Z dg43tfdfdgfd