ఇఫ్తార్ విందుకి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై ట్రోలింగ్

Adah Sharma: నటి అదా శర్మ సంచలన కామెంట్స్ చేసింది. ఉగ్రవాదులు విలన్లు మాత్రమేనని ..వాళ్లు ముస్లింలు కాదనడం ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది. రీసెంట్ గా ది కేరళ స్టోరీలో యాక్ట్ చేసిన అదాశర్మ ఇప్పుడు ముస్లింల గురించి మాట్లాడింది..(Photo: Instagram)
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మార్చి 24న రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ ముంబైలో వార్షిక ఇఫ్తార్ పార్టీని నిర్వహించాడు. ఇందులో అదా శర్మ పాల్గొన్నారు. అక్కడే ఈ కీలక వ్యాఖ్యలు చేసింది సౌత్ బ్యూటీ. .(Photo: Instagram)
ఈ ఇఫ్తార్ పార్టీకి సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. కేరళ స్టోరీ నటి అదా శర్మ కూడా ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. అయితే నెటిజన్లు నటిని ట్రోల్ చేశారు..(Photo: Instagram)
అదాశర్మను నెటిజన్లు ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎంత మోసగత్తెవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత సినిమా తీస్తారు. ఇప్పుడు ముస్లింలు గొప్పవారు ఎందుకంటే వారు మిమ్మల్ని బిర్యానీ భోజనానికి ఆహ్వానించారు. దీనిపై అదా స్పందిస్తూ.. ఉగ్రవాదులు విలన్లని, ముస్లింలు కాదని అందామె..(Photo: Instagram)
బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన కేరళ యువతి ఇప్పుడు ఇఫ్తార్‌లో పాల్గొందని అదాశర్మను ఉద్దేశిస్తూ ది కేరళ స్టోరీ సినిమా చేయడంతో అదాను పోలుస్తూ ట్రోల్ చేశాడో ఓ నెటిజన్. మేడమ్ దయచేసి ముస్లింలపై ప్రచార సినిమా తీయకండి, నేను మీ పెద్ద అభిమానిని అంటూ పోస్ట్ పెట్టాడు..(Photo: Instagram)
దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. తాను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సినిమా తీశానని చెప్పింది. మీరు కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకమని నేను నమ్ముతున్నాను అని రాసింది. ఈ కామెంట్స్ కి లైకులు వస్తున్నాయి..(Photo: Instagram)
ది కేరళ స్టోరీ సినిమా ముస్లింలకు లేదా ఇస్లాంకు వ్యతిరేకమని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. రీడిఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా మాట్లాడుతూ, ఈ చిత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ఫలానా మతానికి, కులానికి వ్యతిరేకం కాదని అన్నారు..(Photo: Instagram)
ఈ సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదని, ఉగ్రవాదానికి వ్యతిరేకమని జనాలకు అర్థమవుతుంది. మా పోరాటంలో మాతో చేతులు కలపాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న వారందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము..(Photo: Instagram)
2023లో విడుదలైన ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ మరియు సిద్ధి ఇద్నానీ కూడా నటించారు. అదా చివరిగా బస్తర్: ది నక్సల్ స్టోరీలో కనిపించింది. ఆమె పైప్‌లైన్‌లో ది గేమ్ ఆఫ్ ఊసరవెల్లి కూడా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో నటి కొత్త సినిమా చేస్తోంది..(Photo: Instagram)
అదా శర్మ హిందీ, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేసినా కొన్నాళ్లుగా ఆమె సినిమాలు హిట్ కాలేదు. అయితే కేరళ స్టోరీ సినిమా అదా శర్మకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమా రాత్రికి రాత్రే హిట్ అవ్వడమే కాకుండా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నటి అదా శర్మ కూడా దీని ద్వారా అవకాశాలు దక్కించుకుంది.(Photo: Instagram)

2024-03-27T11:42:15Z dg43tfdfdgfd