ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను... జయలలిత కీలక ఆరోపణలు!

సీనియర్ నటి జయలలిత దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో శారదా  దేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. 

అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె స్థానంలో మరొకరు నటిస్తున్నారు. అయితే సడన్ గా సీరియల్ మానేయడానికి గల కారణాలు తాజాగా జయలలిత బయటపెట్టారు. ముఖ్యంగా ఆమె ఒకరి వలన ప్రేమ ఎంత మధురం నుంచి తప్పుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ దానికి ప్రొడ్యూసర్. 

ఆయన సీరియల్ ప్రారంభిస్తున్నప్పుడు నన్ను సంప్రదించారు. శ్రీరామ్ మీద ఉన్న అభిమానంతో సీరియల్ ఒప్పుకున్న.  ఓ పెద్దింటి పెద్ద మనిషిగా, శ్రీరామ్ తల్లిగా చేయడం నాకు బాగా నచ్చింది. చాలా రోజులు పాటు హాయిగా సాగింది. కానీ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్లు వచ్చాయి. మాన్సి తో గొడవపడే తన త రెండో కోడలిగా వచ్చిన వచ్చిన అంజలి క్యారెక్టర్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. పెద్ద వాళ్లంటే గౌరవం లేదు. 

సీనియర్ నటి అన్న కనీస రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయి తనకు నచ్చినట్లు ప్రవర్తించేది. సీరియల్ షూటింగ్ లో భాగంగా ఓ వ్రతంలో ఆ అమ్మాయి కూర్చోవాల్సి వచ్చింది. తన చేతికి గాజులు లేకుండా ఉండటం చూసి అత్తగారి హోదాలో వేసుకోమని చెప్పాను. అయితే ఆ విషయం అర్ధం చేసుకోకుండా .. నేను వేసుకోను, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అరిచింది. నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఇదే విషయం శ్రీరామ్ తో చెప్పగా .. మీకు ఇష్టం లేకపోతే చేయోద్దమ్మ అని అన్నాడు. సీరియల్స్ చేయడం నాకు నచ్చడం లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు . 

2024-05-05T10:52:15Z dg43tfdfdgfd