ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్ వార్ షురూ.. చిచ్చు పెట్టిన సెంథిల్ కుమార్?

రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్ని రకాల చర్చలు జరిగాయో అందరికీ తెలిసిందే. నార్త్‌లో ఈ మూవీకి మంచి పేరు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్‌ను మెచ్చుకున్నారు. ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకు అంత గొప్ప పేరు అయితే రాలేదు. పైగా ఈ మూవీలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలపై చర్చలు జరిగాయి. ఇరు హీరోల అభిమానుల మధ్య మంట పెట్టినట్టు అయింది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని.. వాగ్వాదానికి దిగారు అభిమానులు. ఈ వేడి ఇప్పటికీ చల్లారలేదన్న సంగతి తెలిసిందే.

మధ్యలో విజయేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నట్టుగా.. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అన్నట్టుగా కామెంట్ చేశాడు. ఆ టైంలో విజయేంద్ర ప్రసాద్‌ని సైతం అభిమానులు ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు కెమెరామెన్ సెంథిల్ కుమార్ అయితే ఏకంగా క్లైమాక్స్ కన్నా.. ఇంటర్వెల్ సీన్.. ఎన్టీఆర్ అలా యానిమల్స్ మధ్యలోంచి వచ్చే సీనే సినిమాకు హైలెట్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ మీద ఫస్ట్ చేజింగ్ సీన్‌ను అడవుల్లో ప్లాన్ చేశారట. పరిగెత్తే సీన్‌ను షూట్ చేయాలని అనుకున్నారట. ఎన్టీఆర్‌కు యాక్షన్ అని చెప్పడంత అలా పరిగెత్తేశాడట. ఆ స్పీడుని అందు కోలేకపోయారట. ఇలా ఎలా పరిగెత్తారని అడిగితే.. తాను నేషనల్ లెవల్ అథ్లెట్‌ని అని చెప్పుకొచ్చాడట. అలా ఎన్టీఆర్ స్పీడుని అందుకోవడం చాలా కష్టంగా మారిందన్నాడు సెంథిల్.

మా (తెలుగు ప్రజలు) వాళ్లు ఎన్టీఆర్‌ను టైగర్ అని పిలుస్తుంటారు.. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కంటే.. ఇంటర్వెల్‌లో ఎన్టీఆర్ ఎంట్రెన్స్ హైలెట్‌గా ఉంటుందని సెంథిల్ చెప్పిన మాటలతో మళ్లీ ఫ్యాన్ వార్ మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T07:40:23Z dg43tfdfdgfd