ఒకసారిస్తే ప్రభాస్ మళ్ళీ అడిగాడు... వేణు స్వామి భార్య వీడియో వైరల్!

వేణు స్వామి హీరో ప్రభాస్ పై పలుమార్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం పై ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. దాంతో వేణు స్వామిని వారు పలుమార్లు ట్రోల్ చేశారు. ప్రభాస్ కి వివాహం జరగదు. సలార్ ప్లాప్ అవుతుంది. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ... వేణు స్వామి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే నాకేమీ కోపం లేదు. ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తు ఏమిటో చెప్పాను అంతే అన్నారు. 

నెగిటివ్ కామెంట్స్ తో వేణు స్వామి ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ని బాధ పెడుతుంటే... ఆయన భార్య మాత్రం ప్రభాస్ కి ఇష్టమైన బహుమతులు పంపుతుందట. ఎవరికీ తెలియని ఈ విషయాన్ని ఆమె లీక్ చేసింది. మరో విశేషం ఏమిటంటే.. ఒకసారి పంపితే ప్రభాస్ మరోసారి అడిగాడు అట. వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి పంపిన ఆ బహుమతి ఏమిటంటే... సీతాఫలాలు. 

తమ తోటలో పండించిన సీతాఫలాలు ఒక వ్యక్తికి పంపిందట వీణా శ్రీవాణి. అవి ప్రభాస్ వద్దకు చేరాయట.  ఆ సీతాఫలాలు ప్రభాస్ కి ఎంతగానో నచ్చాయట. మళ్ళీ పంపాలని ప్రభాస్ అడిగారట. దాంతో ప్రభాస్ కోసం బాగా పండిన తియ్యని సీతాఫలాలు వీణా శ్రీవాణి పంపిస్తుంది. ఈ బుట్టలో ఉన్న సీతాఫలాలు అన్నీ డార్లింగ్ ప్రభాస్ కే. వీటితో పాటు చేతితో చేసిన ఆర్గానిక్ బ్యాగ్ ని బహుమతిగా ఇస్తున్నానని వీణ శ్రీవాణి అన్నారు.  

ఇక తమ పొలంలో పండిన చివరి పంట ఇది. మళ్ళీ కావాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎవరికీ ఇవ్వకుండా మీరొక్కరే తినేయండని వీణా శ్రీవాణి సదరు వీడియోలో కోరింది. అలాగే తాను ఇచ్చిన బ్యాగ్ లో ఫుడ్ తీసుకెళ్లాలని, అది ప్రభాస్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. వీణా శ్రీవాణి\ వీడియో వైరల్ అవుతుంది. వేణు స్వామి తిడుతుంటే ఈమె పెడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఆహార ప్రియుడన్న విషయం తెలిసిందే.. 

2024-04-16T13:12:56Z dg43tfdfdgfd