ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్

ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్

కోరాపుట్: ఒడిశాలోని గుణుపూర్ అసెంబ్లీ సీటులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానంలో ముగ్గురు బంధువుల మధ్య పోటీ నెలకొంది. వీరందరూ మూడు వేర్వేరు పార్టీల టికెట్లపై పోటీ చేస్తున్నారు. గుణుపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునాథ్ గమాంగ్ బీజేడీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి ఆయన బరిలో దిగారు. రఘునాథ్ (బిడ్డ కొడుకు) మనవడు సత్యజిత్ గమాంగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

అలాగే రఘునాథ్ తమ్ముడి కొడుకు త్రినాథ్ గమాంగ్ బీజేపీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు. దీంతో ఈ స్థానంపై అందరి దృష్టి పడింది. ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ ఫైట్లో ఎవరు గెలుస్తారోనని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుణుపూర్ లో సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిందని, ఆ పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని రఘునాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా,  ఒడిశాలో లోక్ సభతోపాటు అసెంబ్లీకి కూడా  మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

    ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:45:13Z dg43tfdfdgfd