కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు.

 సోమవారం మండిలో విలేకర్లతో రాకేశ్​  మాట్లాడారు.  ‘‘రాజకీయా లు,  చరిత్రకు సంబంధించి కంగనకు తెలిసింది కొంతే..అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. సాధారణ వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. బీజేపీ నేతలు ఆమెకు చరిత్రపై కొంత అవగాహన కల్పించాలి” అని రాకేశ్​ కుమార్ సింగ్​ సూచించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:33:11Z dg43tfdfdgfd