కవితను బెయిల్ పై తీసుకురావడానికి బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తుంది : మదన్ మోహన్ రావు

కవితను బెయిల్ పై తీసుకురావడానికి బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తుంది : మదన్ మోహన్ రావు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ బీ టీమని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపకుండా బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తుందని ఆరోపించారు. తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కూతురు కవితను బెయిల్ పై తీసుకురావడానికి  బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. 

అందుకే 11 మంది బీఆర్ఎస్ పార్టీనీ వీడిన వ్యక్తులుకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. అందుకే గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని చెప్పారు. హీరాబాద్ లో కాంగ్రెస్ కు ఓటు వేసి సురేష్ శెట్కార్ ను గెలిపించాలని సూచించారు. దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమేనని ధీమా వ్యక్తం చేశారు మదన్ మోహన్ రావు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-09T13:51:13Z dg43tfdfdgfd