కేబుల్బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తో పాటు పటాన్ చెరు ట్రాఫిక్, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు శ్రవణ్, సంజయ్ వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో.. ఇక్కడ బర్త్ డే వేడుకలు, సెల్ఫీలు, వాహనాలు నిలపడం చేస్తే జరిమానాతోపాటు శిక్షకు అర్హులని గతంలో పోలీసులు ప్రకటించారు.
ఆ మేరకు మాదాపూర్ ఇన్ స్పెక్టర్ అవగాహన కూడా కల్పించారు. అయితే, ఇదే కేబుల్ బ్రిడ్జిపై ఏప్రిల్ 20 అర్ధరాత్రి జరిగిన బర్త్డే వేడుకల్లో ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్లు పాల్గొని రూల్స్ను బ్రేక్చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రూల్స్సామాన్య ప్రజలకు మాత్రమేనా.. పోలీసులకు వర్తించవా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మాదాపూర్జోన్ డీసీపీ వినీత్ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశించారు. నివేదిక అనంతరం ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T03:15:08Z dg43tfdfdgfd