క్రేజీ సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ.. స్పీడు మీదున్న విజయేంద్ర ప్రసాద్

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలు నేషనల్ వైడ్‌గా సక్సెస్ అవుతుంటాయి. బాహుబలితో విజయేంద్ర ప్రసాద్ డిమాండ్ మరింతగా పెరిగింది. అంతకు ముందే భజరంగీ భాయీజాన్ మూవీతో బాలీవుడ్‌లో రైటర్‌గా విజయేంద్ర ప్రసాద్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ అంతగా క్లిక్ కాలేదు. రాజన్న హిట్ అయింది.. కానీ ఆ తరువాత చేసిన శ్రీవల్లి డిజాస్టర్ అయింది. అందుకే ఆయన డైరెక్షన్ జోలికి పోవడం లేదు. ఉన్న టైం అంతా కూడా రైటింగ్ మీదే పెడుతుంటారు. ఇప్పుడు ఆయన రాజమౌళి మహేష్ బాబు స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ మరి కొన్ని స్క్రిప్టులను కూడా పూర్తి చేశాడు. విక్రమార్కుడు సీక్వెల్ మీద విజయేంద్ర ప్రసాద్ ఎంతో ఉత్సుకతను చూపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ పార్ట్ 2 కథని కూడా పూర్తి చేశాడట. కానీ ఈ మూవీని తెలుగులో ఎలా తీస్తారు.. తీస్తే ఎవరు తీస్తారు? అన్నది సమస్య. రాజమౌళి లేకపోతే రవితేజ ఈ చిత్రాన్ని చేయడు. రవితేజ లేకుండా అసలు ఆ పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు. ఒక వేళ రౌడీ రాథోడ్ అంటూ బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ఆల్రెడీ రీమేక్ చేశాడు. ఒక వేళ అక్షయ్ కుమార్‌కు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఇస్తే చేసుకుంటాడు.

ఇక భజరంగీ భాయీజాన్ బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి మరోసారి సల్మాన్ సత్తాను చాటింది. అలాంటి మూవీకి కూడా సీక్వెల్ స్రిప్ట్ రెడీ అయిందట. మరి ఈ స్క్రిప్ట్‌ను సల్మాన్ ఖాన్‌కు నెరేట్ చేయాల్సి ఉంటుంది. సల్మాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా ఆ క్రేజీ సీక్వెల్‌కు నో అయితే చెప్పలేడు. అంటే విజయేంద్ర ప్రసాద్ ఆ సీక్వెల్ స్క్రిప్ట్ చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది. కానీ ఎటొచ్చి విక్రమార్కుడు 2 కి లైన్ ఎల ా క్లియర్ అవుతుంది? ఎవరు నటిస్తారు.. ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది సమస్య. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T02:55:52Z dg43tfdfdgfd