బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!
హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
2024-07-05T13:03:08Z
Actor: పేరుకు ఆ తెలుగు హీరో ఆస్తి రూ.5000 కోట్లు.. పిల్లలకు మాత్రం చిల్లిగవ్వ కూడా రాదు..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ వంశానికి పదవ నవాబు. ఈ స్టార్ హీరో తన తండ్రి దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి నుండి దీన్ని వారసత్వంగా పొందాడు. అలీ ఖాన్ భారత క్రికెట్ జట్టులో ఆడాడు. 2011లో మన్సూర్ అలీ ఖాన్ మరణానంతరం హర్యానాలోని పటౌడీ ఊర్లో సింబాలిక్ పగ్రీ వేడుక జరిగింది. సైఫ్ అతన్ని పటౌడీకి పదవ నవాబుగా పట్టాభిషేకం చేశారు. ఆ ఊరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైఫ్ తన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సైఫ్ అలీ ఖాన్కు ఇద్దరు చెల్లెళ్లు. అందులొో ఒకరు సబా అలీ ఖాన్, మరోకరి ప్రముఖ నటి సోహా అలీ ఖాన్. వీరంతా నవాబు కుటుంబానికి చెందిన వారసులు. సైఫ్కు హర్యానాలోని పటౌడీ ప్యాలెస్తో పాటు భోపాల్లోని ఇతర పూర్వీకుల ఆస్తులు విలువ మొత్తం అక్షరాల రూ. 5,000 కోట్లు. కాగా సైఫ్ అలీఖాన్ తండ్రి, తాత సమాధులు హర్యానాలో ఉన్నాయి. తన తండ్రి నుండి ఆస్తిని వారసత్వంగా పొందడంతో, సైఫ్ తన పిల్లలైన సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ తో పాటు జహంగీర్ అలీ ఖాన్లను కూడా వారసత్వంగా పొందడం ఆనవాయితి. అయితే ఇక్కడ న్యాయపరమైన చిక్కు ఒకటుంది. అదేంటంటే.. బాలీవుడ్లైఫ్ నివేదిక ప్రకారం, హౌస్ ఆఫ్ పటౌడీ భారత ప్రభుత్వానికి సంబంధించిన వివాదాస్పద శత్రు వివాదాల చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఎవరూ దానిని వారసులుగా చెప్పుకోలేరు. హౌస్ ఆఫ్ పటౌడీకి చెందిన అన్ని ఆస్తులు మరియు ఇతర సంబంధిత ఆస్తులన్నీ అదే చట్టం కిందకు వస్తాయి. దాంతో అలాంటి ఆస్తికి ఎవరూ వారసులమని చెప్పలేరు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులు, ఆస్తులు తమకు చెందవని చెబుతున్నారు. అయితే ఈ కుంటుంబానికి చెందిన వ్యక్తి ఆస్తులను క్లెయిమ్ చేయాలనుకుంటే, ఆ ఆస్తి తమదని నమ్మితే, వాళ్లు హైకోర్టు, అది విఫలమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగక పోతే చివరకు రాష్ట్రపతిని ఆశ్రయించవచ్చు. ప్రస్తుతం సైఫ్ దేవర సినిమాలో విలన్గా చేస్తున్నాడు.
2024-07-06T11:37:32Z