జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

అలనాటి అందాల తార.. సహజనటి జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలను మాత్రమే అన్నయ్యా అని పిలుస్తారట. దానికి ఓ కారణం కూడా ఉంది అంటున్నారు ఆమె. ఇంతకీ ఏంటా కారణం..? ఎవరా ఇద్దరు..? 

జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు తెచ్చుకున్న ఏకైక తార. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సుల్లో ఆమె స్థానం చెరిపినా చెరగని చిత్రం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు జయసుధ. హీరోయిన్ కు ఉండాల్సిన  అందం, అభినయంతో  పాటు.. ట్రెండ్ కు తగ్గట్టు తనను తానుమలుచుకుని.. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తార జయసుధ. 

 

ఇండస్ట్రీలో  సహజనటి అంటే ఇప్పటికీ.. ఎప్పటికీ జయసుధకే ఆ స్థానం. అలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ కూడా జయసుధనే. రెండు తరాల హీరోలతో నటించి మెప్పించారు జయసుధ. కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు సరసన నటించిన ఆమె.. ఆతరువాత మురళీమోహన్, మోహన్ బాబు,  చిరంజీవి తదితర దిగ్గజ హీరోలతో కూడా నటించారు. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

ఐదు దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమలో తిరుగులోని నటిగా రాణించారు జయసుధ(Jayasudha). ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తున్నారు. 

 

కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన అందాల తార.. స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్ధాల పాటు వెలుగు వెలిగారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జయసుధ.. తనకుసబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల గురించి కూడా మాట్లాడారు జయసుధ. టాలీవుడ్ లో తాను ఇద్దరు హీరోలను మాత్రమే అన్నయ్య అని పిలుస్తాను అన్నారు. 

శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను సొంత ఫ్యామిలీగా భావించేది కొంత మందినే అని నిక్కచ్చిగా చెప్పారు. కుటుంబం అంటే కుటుంబమే.. నా కుటుంబంలో ఇండస్ట్రీ నుంచి మురళీ మోహన్, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు అని అన్నారు జయసుధ. వాళ్ళు మాత్రమే నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. అందుకే వారిని నా ఫ్యామిలీ మెంబర్స్ గా చూస్తాను అని అన్నారు సహజనటి. 

మురళీ మోహన్, మోహన్ బాబు జంటగా చాలా సినిమాలు చేశారు జయసుధ. అర్ధాంగి, దేవత, శ్రీమతిగారు, ఓ తండ్రి తీర్పు, ఏడడుగుల బంధం, నామొగుడు నాకు సొంతం లాంటి సినిమాలు ఇద్దరు హీరోలతో చేశారు జయసుధ. వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 

అంతేకానీ ఎవరిని పడితే వారిని అన్నయ్య, అక్కఅని పిలిచే అలవాటు నాకు లేదు.. ఎవరితో ఎక్కడివరకూ ఉండాలో.. అక్కడి వరకూ మాత్రమే ఉంటాను అంటూ.. జయసుధ  కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ చూసిన జయసుధ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్నిఒడిదుడుకులు చూసింది. 

 

ఒక్కప్పుడు హీరోయిన్ గా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ..వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన జయసుధ.. ఆతరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రకరకాల పార్టీలు మారారు. సికింద్రబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించారు.. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నారు జయసుధ. ప్రస్తుతం ఒక ఇంగ్లీష్ మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

2024-04-28T03:08:35Z dg43tfdfdgfd