జియో సేవలను ఏకిపారేసిన నటి కుష్బూ

నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటారు. మహిళా కమిషన్‌ చైర్మన్‌గా అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాల మీద స్పందిస్తూ ఉంటారు. ఇక ట్విట్టర్లో వచ్చే నెగెటివ్ కామెంట్లకు తన స్టైల్లో సమాధానం ఇస్తుంటారు. తాజాగా కుష్బూ జియో సేవల పట్ల అసంతృప్తి చెంది సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. హైద్రాబాద్ జియో సేవలు అత్యంత దుర్భలంగా ఉన్నాయని ట్వీట్ వేసింది. కస్టమర్ కేర్ సెంటర్ నుంచి కూడా రియాక్షన్ లేదని ఫైర్ అయింది. ఈ మేరకు కుష్బూ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

జియో సేవలు అంత బాగా లేవని, కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదని ఫైర్ అయింది. ఇలాంటిది ఎక్కడా చూడలేదని, కాస్త బెటర్‌గా ఉంటుందని ఊహించానని కుష్బూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరి ఈ ట్వీట్ మీద జియో నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కుష్బూ ఇలా ట్వీట్ వేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అవును మేడం మాకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురువుతున్నాయి.. ఇదంతా మీ బాస్ మోడీ మోనోపలి వల్లే వచ్చింది మేడం.. టెలికాం రంగంలో మోనోపలిని తీసుకొచ్చారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం కుష్బూ అయితే బీజేపీలోనే ఉందన్న సంగతి తెలిసిందే. మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో బాగానే ప్రచారం చేసింది. తొలి విడత పోలింగ్‌ భాగంలో తమిళ నాడులో కుష్బూ తన ఓటు హక్కుని వినియోగించుకుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T06:05:17Z dg43tfdfdgfd