డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్లు, ఇతర పరికరాలు ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు.
ఈ డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం డీజీపీకి సాయి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సాయి కోరారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T04:45:38Z dg43tfdfdgfd