తీర్థయాత్రలకు వెళ్లి వచ్చి చూస్తే..నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ

తీర్థయాత్రలకు వెళ్లి వచ్చి చూస్తే..నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ

  • దమ్మాయిగూడలో దొంగతనం
  • నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ
  • తీర్థయాత్రలకు వెళ్లిన కుటుంబసభ్యులు 

హైదరాబాద్ :  తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. అంజనాద్రి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి మహిపాల్ రెడ్డి   రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తీర్థయాత్రకు వెళ్లారు. ఆయన ఇంట్లో మొన్న రాత్రి దొంగలు పడ్డారు.

బీరువా పగలగొట్టి అందులో  నాలుగు తులాల బంగారం, ఆరువేల నగదును దుండగులు అపహరించారు.  నిన్న రాత్రి ఇంటికి చేరుకున్న మహిపాల్ కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.  ఇద్దరు వ్యక్తులు గోడ దూకుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు  జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు  చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T12:49:51Z dg43tfdfdgfd