థ్రిల్లర్‌ కథతో ‘రాచరికం’

అప్సరా రాణి, విజయ్‌శంకర్‌, వరుణ్‌సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్‌ లంకపల్లి దర్శకుడు. ఈశ్వర్‌ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. బుధవారం ఈ సినిమా నుంచి అప్సరా రాణి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో అప్సరా రాణి అద్భుతమైన పాత్రలో కనిపిస్తుందని, సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఆమె నటన ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. హైపర్‌ ఆది, రంగస్థలం మహేష్‌, విజయ రామరాజు, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యసాయి, సంగీతం: వెంగీ.

2024-07-03T19:26:18Z dg43tfdfdgfd