నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ

నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను  బ్రతికున్నంత వరకూ జిల్లాను మార్చనివ్వబోనని చెప్పారు.  కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్ళు కావాలని రేవంత్ రెడ్డి కి విన్నవిస్తామన్నారు. కరువుకు కాంగ్రెస్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.  తన  ఫోన్ ను కూడా ఐదేళ్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు 

ప్రభుత్వాలు కూల గొట్టడంలో బీజేపీ నంబర్ వన్ అని విమర్శించారు షబ్బీర్ అలీ. వారి ఉనికి కోసమే బీజేపీ వాళ్లు కాంగ్రెస్ కూలి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని హామీలు నెరవేర్చారో ముందు  చెప్పాలని అర్వింద్ ను ప్రశ్నించారు. ఏమైనా అడిగితే బీజేపీ వాళ్లు హిందూ ముస్లిం గొడవలంటారన్నారు.  

ధనిక రాష్ట్రం తెలంగాణాను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ వచ్చాక చిప్ప చేతికిచ్చిందన్నారు. ఆరులో  ఐదు గ్యారెంటీ లు అమలు చేశామని.. ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T11:38:51Z dg43tfdfdgfd