ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఇది కదా కావాల్సింది‌.. ఫ్యాన్స్ చించేసుకోవాల్సిందే..

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా సలార్‌తో పలకరించాడు. ఈ సినిమా 2023  డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా  650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు.  సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే  విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలన్స్ ఉన్న కారణంగా మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది టీమ్. ఈ విషయంలో ఓ పోస్టర్‌తో అధికారిక ప్రకటన విడుదలైంది.

అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ ఖతర్నాక్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ సమాచారం మేరకు, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర అనేది వాయిస్ రూపంలో ఉంటుందట. కల్కీలో విష్ణు అవతారానికి మహేష్ బావు వాయిస్ ఓవర్ అందిస్తాడని అంటున్నారు. అంతేకాదు మహేష్ ఓ పాత్రలో కూడా కనిపించనున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నారట. శివుడి వాహానం నంది అని తెలిసిందే. నంది శివుని సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు. అలా ఈ సినిమాలో ఆయన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌కు సహాయకుడిగా ఉంటారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఇక ఈచిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. కేవలం హిందీ డిజిటల్ రైట్స్ రూ. 175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. ఈ హిందీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక మరోవైపు సౌత్ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను రూ. 150 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఎన్టీఆర్, నాని కూడా నటిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఎన్టీఆర్, నాని కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడుస్తోంది. సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాతో ప్రభాస్, రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు చేస్తున్నారు. రాజా సాబ్ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను టీమ్ విడుదల చేసింది టీమ్. ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్స్‌గా మాళవిక, శ్రీలీల చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగుతో పాటుగా, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

2024-05-08T07:37:03Z dg43tfdfdgfd