ఫోన్ చోరీకి వచ్చి మర్డర్ చేశారు

ఫోన్ చోరీకి వచ్చి మర్డర్ చేశారు

  • యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు  
  • గుడిమల్కాపూర్ లో ఘటన​

మెహిదీపట్నం, వెలుగు : ఫోన్ చోరీకి వచ్చి ఓ యువకుడిని దుండగులు మర్డర్ చేసిన సంఘటన గుడి మల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మురాద్ నగర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ కొడుకు సనావుల్లా (24) పట్ పాత్ విక్రేత.  మంగళవారం అర్ధరాత్రి అతడు గుడి మల్కాపూర్ రింగ్ రోడ్డులో పిల్లర్ నంబర్ 65 వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు.  ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి సనావుల్లా ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు.

అది వీలు కాకపోవడంతో  కత్తి తో చాతీ, భుజంపై పొడిచి ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడిని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.  పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T02:44:33Z dg43tfdfdgfd