బజ్రంగ్ ఒలింపిక్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ప్రొవిజినల్ సస్పెన్షన్కు గురైన ఇండియా స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాకు.. రెజ్లింగ్ వరల్డ్ గవర్నింగ్ బాడీ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా షాకిచ్చింది. అతనిపై ఈ ఏడాది చివరి వరకు సస్పెన్షన్ను విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో బజ్రంగ్ పారిస్ ఒలింపిక్ ఆశలు ముగిసినట్లే. డోప్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఏప్రిల్ 23న బజ్రంగ్పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. ‘యాంటీ డోపింగ్ రూల్స్ను ఉల్లంఘించినందుకు నాడా ఇండియా బజ్రంగ్ను సస్పెండ్ చేసింది. దాన్ని మేం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నాం. అతని ప్రొఫైల్ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని యూడబ్ల్యూడబ్ల్యూ పేర్కొంది. అయితే వరల్డ్ గవర్నింగ్ బాడీ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని బజ్రంగ్ వెల్లడించాడు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-10T01:36:35Z dg43tfdfdgfd