బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు

బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు

ఆత్మకూరు: అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డును భూమిలో పాతిపెట్టి చంపాలని చూశారు. దీనిని ఓ లారీ డ్రైవర్​ గమనించి, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ  శివారులో అప్పుడే ఓ పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టారు. 

కాగా పక్కనే ఉన్న ఓ లారీ డ్రైవర్ భూమిలో శిశువు కదలికలను గమనించి, స్థానికులకు సమాచారం అందించాడు.  ఘటనా స్థలానికి చేరుకుని మట్టిలో నుంచి పసి గుడ్డును బయటకు తీశారు. ప్రాణంతోనే ఉండటంతో వెంటనే  నీళ్లతో శుభ్రం చేసి  వరంగల్ ఎంజీఎం తరలించగా డాక్టర్లు సరైన ట్రీట్​మెంట్​ అందించి ఆ పసిపాప ప్రాణాలు నిలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T12:08:55Z dg43tfdfdgfd