బాలానగర్ లో గంజాయి పట్టివేత

బాలానగర్ లో గంజాయి పట్టివేత

హైదరాబాద్ లోని భరత్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు.  శ్రీకాకుళంకు చెందిన బచ్చల లోకేష్.. ఏపీ  ఇచ్ఛాపురంలో గంజాయి అమ్ముతున్న నరేష్ దగ్గర కొని హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో యవతకు విక్రయిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరతనగర్ ప్లై ఓవర్ వద్ద SOT బాలానగర్ టీమ్ మరియు సనత్ నగర్  పోలీసులు సంయుక్తంగా తనిఖీ నిర్వహిస్తుండగా లోకేశ్ పట్టుబడ్డాడు. అతడి బ్యాగ్ లో నుంచి 57 వేల 500 విలువ గల 2.3 కేజీల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోకేశ్ కి సరఫరా చేస్తున్న నరేష్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T05:01:06Z dg43tfdfdgfd