బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్​రెడ్డి

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్  పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  అభ్యర్థిగా ఏనుగు రాకేశ్ రెడ్డి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్  శుక్రవారం ప్రకటించారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  నేత పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇటీవలే ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్  విడుదల చేసింది.

శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్  చేశారు. చాలా కాలంపాటు బీజేపీలో పనిచేసిన రాకేశ్.. టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఇప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  నుంచి ఎమ్మెల్సీ టికెట్  పొందారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T02:52:38Z dg43tfdfdgfd