బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్

బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో  రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న  వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి రవికుమార్, వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

 రానున్న కొద్ది రోజుల్లోనే తగు సిబ్బందితోపాటు వైద్య నిపుణులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ తో పాటు సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ కోటేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ తో పాటు పలువురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T04:51:30Z dg43tfdfdgfd