భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును పెంచినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 25 వరకు బుకింగ్చేసుకునే వెసులుబాటు కల్పించి నట్టు చెప్పారు. రూ. 151 రూపాయలు చెల్లించి రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందే సదవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన కోరారు.
టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్సైట్ ద్వారా తలంబ్రా లను బుక్చేసుకోవచ్చని అన్నారు. అలాగే ఆఫ్లైన్ ద్వారా పొందాలనుకునే వారు టీఎస్ ఆర్టీసీ కాల్సెంటర్ఫోన్నంబర్లను 040-23450033, 040-69440000, 040-69440069 సంప్రదించాలని కోరారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-20T03:31:02Z dg43tfdfdgfd