భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును పెంచినట్టు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 25 వరకు బుకింగ్​చేసుకునే వెసులుబాటు కల్పించి నట్టు చెప్పారు. రూ. 151 రూపాయలు చెల్లించి రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందే సదవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన కోరారు. 

టీఎస్​ ఆర్టీసీ లాజిస్టిక్​ విభాగం వెబ్​సైట్ ద్వారా తలంబ్రా లను బుక్​చేసుకోవచ్చని అన్నారు. అలాగే ఆఫ్​లైన్​ ద్వారా పొందాలనుకునే వారు టీఎస్​ ఆర్టీసీ కాల్​సెంటర్​ఫోన్​నంబర్లను 040-23450033, 040-69440000, 040-69440069 సంప్రదించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T03:31:02Z dg43tfdfdgfd